అధిష్ఠానం గమనిస్తోంది: మాణిక్యం ఠాకూర్

ABN , First Publish Date - 2022-02-27T22:01:57+05:30 IST

కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేసేందుకే డిజిటల్ సభ్యత్వ నమోదు చేస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తెలిపారు.

అధిష్ఠానం గమనిస్తోంది: మాణిక్యం ఠాకూర్

హైదరాబాద్: కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేసేందుకే డిజిటల్ సభ్యత్వ నమోదు చేస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఎవరు పనిచేస్తున్నారో.. ఎవరు చేయడం లేదో అధిష్ఠానం గమనిస్తోందని తెలిపారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తకు సమన్యాయం కల్పించడమే పార్టీ ఉద్దేశమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని ఎవరు పనిచేస్తున్నారు.. ఎవరు పని చేయడం లేదో అధినాయకత్వం గమనిస్తోందని చెప్పారు. సభ్యత్వ నమోదు కోసం పనిచేస్తున్న 24 వేల కార్యకర్తల వివరాలు అధినేత రాహుల్ గాంధీ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మాణిక్యం ఠాకూర్ పిలుపునిచ్చారు.


Updated Date - 2022-02-27T22:01:57+05:30 IST