లఖింపూర్ ఖేరీ ఘటనపై చర్చ జరపాలని లోక్సభ మాణికం ఠాగూర్ వాయిదా తీర్మానం
ABN , First Publish Date - 2021-12-03T15:58:35+05:30 IST
లఖింపూర్ ఖేరీ ఘటనపై చర్చ జరపాలని లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు.
ఢిల్లీ : లఖింపూర్ ఖేరీ ఘటనపై చర్చ జరపాలని లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి వల్ల అమాయక రైతులు చనిపోవడంపై చర్చించాలని, దోషిని శిక్షించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, ప్రధాని అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరుతూ మాణికం ఠాగూర్ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.