మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుని రాజీనామా... బీజేపీలో చేరనున్న 8 మంది ఎమ్మెల్యేలు!

ABN , First Publish Date - 2021-07-21T16:22:22+05:30 IST

మణిపూర్‌లో కూడా కాంగ్రెస్ సంకట పరిస్థితిలో...

మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుని రాజీనామా... బీజేపీలో చేరనున్న 8 మంది ఎమ్మెల్యేలు!

ఇంఫాల్: మణిపూర్‌లో కూడా కాంగ్రెస్ సంకట పరిస్థితిలో చిక్కుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోవిందదాస్ కొంథుజమ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదేసమయంలో ఈరోజు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 


కాగా గోవిందదాస్ మణిపూర్ సీటు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది డిసెంబరులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈయనను మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించారు. మణిపూర్‌లో వచ్చేఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ కు ఇధి కోలుకోలేని దెబ్బగా పరిణమించింది. 2017లో తొలిసారి బీజేపీ మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. రాబోయే ఎన్నికల్లో 60 సీట్లలో గెలిచి అధికారంలోకి వస్తామని స్థానిక బీజేపీ నేతలు చెబుతున్నారు. 


Updated Date - 2021-07-21T16:22:22+05:30 IST