Manjapai Express: రూ.9 కోట్లతో ‘మంజపై ఎక్స్ప్రెస్’
ABN , First Publish Date - 2022-10-07T15:35:12+05:30 IST
ప్రత్యేక కోచ్లతో రూ.9 కోట్లతో తయారుచేస్తున్న ‘మంజపై ఎక్స్ప్రెస్ రైలు’ను డిసెంబరులో నడుపనున్నట్లు కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు
ఐసీఎఫ్(చెన్నై), అక్టోబరు 6: ప్రత్యేక కోచ్లతో రూ.9 కోట్లతో తయారుచేస్తున్న ‘మంజపై ఎక్స్ప్రెస్ రైలు’ను డిసెంబరులో నడుపనున్నట్లు కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తెలిపారు. ఐఆర్సీటీసీ, కాలుష్య నియంత్రణ బోర్డు సంయుక్తంగా ‘మీండుమ్ మంజపై (మళ్ళీ పసుపు సంచి) ఎక్స్ప్రెస్ రైలు’ ప్రదర్శన నిర్వహించనున్నాయి. ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ, ఈ ప్రదర్శన ద్వారా పర్యావరణ భద్రత, ప్లాస్టిక్ నిషేధం వంటి వాటిపై అవగాహన కల్పించనున్నామని పేర్కొన్నారు. 18 కోచ్లతో తయారయ్యే ఈ రైలులో వీడియోలు, ఫొటోలు, లఘుచిత్రాలుంటాయని, ప్రతి జిల్లాలో రెండు రోజులు ఈ ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.