మన్‌ కీ బాత్ కార్యక్రమంలో విఠలాచార్యపై ప్రధాని ప్రశంసలు

ABN , First Publish Date - 2021-12-27T01:56:25+05:30 IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో...

మన్‌ కీ బాత్ కార్యక్రమంలో విఠలాచార్యపై ప్రధాని ప్రశంసలు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణ యాదాద్రి జిల్లా రామన్నపేటకు చెందిన అధ్యాపకుడు విఠలాచార్య గురించి ప్రస్తావించారు. కలలను నెరవేర్చుకునేందుకు వయసుతో సంబంధం లేదన్న మోదీ 2 లక్షల పుస్తకాలతో విఠలాచార్య గ్రంథాలయం ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించారు. 84 సంవత్సరాల విఠలాచార్య జీవితకాలం దాచుకున్న డబ్బునంతా లైబ్రరీ కోసం ఖర్చుచేశారని మోదీ మెచ్చుకున్నారు. 

Updated Date - 2021-12-27T01:56:25+05:30 IST