వ్యక్తి దారుణహత్య
ABN , First Publish Date - 2022-08-19T05:14:27+05:30 IST
పాతకక్షల నేపథ్యంలో ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న వ్యక్తిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి దారుణంగా హత్యచేసిన సంఘటన మండలంలోని మలికెపల్లిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. గ్రామానికి చెందిన ఎరువ వెంకటేశ్వరరెడ్డి కుటుంబానికి, బొల్లిబోయిన రోశయ్య కుటుంబానికి కొన్నేళ్ల నుంచి గొడవలు ఉన్నాయి. బుధవారం రాత్రి సమీపంలోని చింతపల్లిలో పీర్ల పండుగ జరుగుతుండగా గ్రామస్థులు అక్కడకు వెళ్లారు.
పాత కక్షలే కారణం
పోలీసుల అదుపులో నిందితుడు
కొమరోలు, ఆగస్టు 18 : పాతకక్షల నేపథ్యంలో ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న వ్యక్తిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి దారుణంగా హత్యచేసిన సంఘటన మండలంలోని మలికెపల్లిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. గ్రామానికి చెందిన ఎరువ వెంకటేశ్వరరెడ్డి కుటుంబానికి, బొల్లిబోయిన రోశయ్య కుటుంబానికి కొన్నేళ్ల నుంచి గొడవలు ఉన్నాయి. బుధవారం రాత్రి సమీపంలోని చింతపల్లిలో పీర్ల పండుగ జరుగుతుండగా గ్రామస్థులు అక్కడకు వెళ్లారు. ఎవరూ లేకపోవడాన్ని గమనించి ఇంటి బయట నిద్రిస్తున్న వెంకటేశ్వరరెడ్డిని రోశయ్య కత్తితో నరికి హత్యచేశాడు. ముందు మెడను కోసి, తరువాత చేతి కింద, పొట్టలో గాయపరిచాడు. ఈ దాడిలో వెంకటేశ్వరరెడ్డి(48) అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం రోశయ్య పోలీసులకు లొంగిపోయాడు. గిద్దలూరు సీఐ ఫిరోజ్, ఎస్ఐ సాంబశివయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం వెంకటేశ్వరరెడ్డి మృతదేహాన్ని గిద్దలూరు వైద్యశాలకు తరలించారు.