పలువురు ప్రముఖులు శారదా పీఠం సందర్శన
ABN , First Publish Date - 2021-11-29T06:43:25+05:30 IST
చినముషిడివాడలోని శారదా పీఠాన్ని పలువురు ప్రముఖులు ఆదివారం సందర్శించారు. పీఠంలోని దేవతామూర్తులు, శారదా రాజశ్యామల అమ్మవారిని దర్శించి పూజలు చేశారు.
పెందుర్తిరూరల్, నవంబరు 28: చినముషిడివాడలోని శారదా పీఠాన్ని పలువురు ప్రముఖులు ఆదివారం సందర్శించారు. పీఠంలోని దేవతామూర్తులు, శారదా రాజశ్యామల అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. అన్నమయ్య వంశానికి చెందిన హరినారాయణాచార్యులు, నెల్లూరుకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు శారదా పీఠాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.