ఏఎస్ఐ సీతారామరాజుకు పలువురి నివాళి
ABN , First Publish Date - 2021-06-18T07:09:44+05:30 IST
రాజాపేట పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన పి.సీతారామరాజు భౌతిక కాయానికి గురువారం పలువురు నివాళులర్పించారు
రాజాపేట, జూన్ 17: రాజాపేట పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన పి.సీతారామరాజు భౌతిక కాయానికి గురువారం పలువురు నివాళులర్పించారు. ఏఎస్ఐ మృత దేహాన్ని హైదరాబాద్కు తరలించి అంత్యక్రియలను నిర్వహించారు. సీతారామరాజు మృతదేహానికి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ నర్సింహారెడ్డి, సీఐ నర్సయ్య, ఎస్ఐ శ్రీధర్రెడ్డిలు నివాళులర్పించారు. పోలీసు లాంఛనాలతో ఏఎస్ఐ అంత్యక్రియలు నిర్వహించారు.