మన్యంలో ముసురు
ABN , First Publish Date - 2022-06-28T05:47:24+05:30 IST
త మూడు రోజులుగా మన్యంలో ముసురు వాతావరణం కొనసాగుతున్నది. సోమవారం సైతం ఏజెన్సీలో పలు మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి.
పలు మండలాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు
పాడేరు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): గత మూడు రోజులుగా మన్యంలో ముసురు వాతావరణం కొనసాగుతున్నది. సోమవారం సైతం ఏజెన్సీలో పలు మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి. జిల్లా కేంద్రం పాడేరులో సోమవారం ఉదయం ఒక మోస్తారుగా వర్షం కురిసింది. పది గంటల తరువాత తెరిపి ఇచ్చి ఎండ కాసింది. కానీ ఎండ ఎక్కువ సమయం లేదు. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ముసురు వాతావరణం కొనసాగింది. తాజా వర్షానికి రోడ్లన్నీ తడిచి ముద్దయ్యాయి. హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. అనంతగిరి మండలంలోని నాన్షెడ్యూల్ ప్రాంతంలో ఒక మోస్తారు వర్షం కురవగా, ముంచంగిపుట్టు, పెదబయలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకున్నా వానజాడ లేదు. తాజా వర్షాలు ఖరీఫ్ వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటాయని రైతులు అంటున్నారు.