అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-07-23T04:25:50+05:30 IST
మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలను ఈనెల 28నుంచి అగస్టు 3వరకు ఘనంగా జరుపుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పిలుపునిచ్చారు.
‘ఆజాద్’ పేరిట మావోయిస్టుల లేఖ
చర్ల, జులై 22: మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలను ఈనెల 28నుంచి అగస్టు 3వరకు ఘనంగా జరుపుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పిలుపునిచ్చారు. గురువారం చర్ల పాత్రికేయులకు ఆయన లేఖను విడుదల చేశారు. ఈ సంవత్సరకాలంలో కేంద్రకమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాపనారాయణ, కత్తి మోహన్రావు, సిద్దిబోయిన సారక్క, గడ్డం మధుకర్, గంగాల్, గంగన్న, సుధీర్, లక్మాల్, సుక్మాల్, జుగునక, బిక్షపతిలు అమరులయ్యారని తెలిపారు. వారికి జోహార్లు అర్పిస్తూ వారి ఆశయసాధన కోసం ముందుకు నడవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.