అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-07-23T04:25:50+05:30 IST

మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలను ఈనెల 28నుంచి అగస్టు 3వరకు ఘనంగా జరుపుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ పిలుపునిచ్చారు.

అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
మావోయిస్టులు విడుదల చేసిన లేఖ

‘ఆజాద్‌’ పేరిట మావోయిస్టుల లేఖ

చర్ల, జులై 22: మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలను ఈనెల 28నుంచి అగస్టు 3వరకు ఘనంగా జరుపుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ పిలుపునిచ్చారు. గురువారం చర్ల పాత్రికేయులకు ఆయన లేఖను విడుదల చేశారు. ఈ సంవత్సరకాలంలో కేంద్రకమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాపనారాయణ, కత్తి మోహన్‌రావు, సిద్దిబోయిన సారక్క, గడ్డం మధుకర్‌, గంగాల్‌, గంగన్న, సుధీర్‌, లక్మాల్‌, సుక్మాల్‌, జుగునక, బిక్షపతిలు అమరులయ్యారని తెలిపారు. వారికి జోహార్లు అర్పిస్తూ వారి ఆశయసాధన కోసం ముందుకు నడవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-07-23T04:25:50+05:30 IST