కడంబ ఎన్‌కౌంటర్ బూటకం: మావో నేత ప్రభాత్

ABN , First Publish Date - 2020-09-23T13:08:17+05:30 IST

కడంబ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంట్‌ ఓ బూటకమని...దీనికి మూల్యం చెల్లించక తప్పదని మావోయిస్టు కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ హెచ్చరించారు.

కడంబ ఎన్‌కౌంటర్ బూటకం: మావో నేత ప్రభాత్

మంచిర్యాల: కడంబ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఓ బూటకమని...దీనికి మూల్యం చెల్లించక తప్పదని మావోయిస్టు కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ హెచ్చరించారు. సమస్యలను తప్పుదోవ పట్టించేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్‌కౌంటర్లకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్‌కౌంటర్ పేరిట జరుగుతున్న హత్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని మావోయిస్టు నేత ప్రభాత్ తెలిపారు. 

Updated Date - 2020-09-23T13:08:17+05:30 IST