TS News: వరంగల్‌లో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల

ABN , First Publish Date - 2022-08-29T18:26:16+05:30 IST

జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. ఏటూరునాగారం మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబితా పేరుతో లేఖ విడుదలైంది.

TS News: వరంగల్‌లో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల

వరంగల్: జిల్లాలో మావోయిస్టుల లేఖ (Maoist letter) కలకలం రేపుతోంది. ఏటూరునాగారం మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబితా పేరుతో లేఖ విడుదలైంది. గతంలో నుంచి ప్రభుత్వాలు నష్టాల పేరుతో పరిశ్రమలను మూత వేసి కార్మికులను రోడ్డున పడేసాయని అన్నారు. సింగరేణి (Singareni)లో 1,20,000 మంది కార్మికులు పని చేసేవారు ఇప్పుడు 42 వేలకు పడిపోయారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల్లోకి నెట్టి నష్టాలు వస్తున్నాయని సాకుతో ప్రభుత్వాలు మూతపడేస్తున్నాయని లేఖలో మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Government) మూతపడిన పరిశ్రమలు తెరిపిస్తామని మేనిఫెస్టోలో చేర్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పరిశ్రమ కూడా తెరవలేదన్నారు. పరిశ్రమలు మూతపడేసిన పాపం ప్రభుత్వాలదే అని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తప్పులు చేసి కార్మికులను రోడ్డున పడేసి కార్మికుల కుటుంబాలతో చెలగాటం ఆడుతున్నాయంటూ మావోయిస్టులు లేఖలో తెలిపారు. 

Updated Date - 2022-08-29T18:26:16+05:30 IST