TS News: గోదావరి వరద బాధితులకు సహాయం చేయాలంటూ మావోల లేఖ

ABN , First Publish Date - 2022-07-25T16:03:37+05:30 IST

గోదావరి వరదలలో సర్వం కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వాలు వెంటనే సహాయం చేయాలంటూ మావోయిస్టులు లేఖ రాశారు.

TS News: గోదావరి వరద బాధితులకు సహాయం చేయాలంటూ మావోల లేఖ

భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి వరదలలో సర్వం కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వాలు వెంటనే సహాయం చేయాలంటూ మావోయిస్టులు(Maoist) లేఖ రాశారు. మావోయిస్టు పార్టీ చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరు మీద లేఖ విడుదలైంది. వరద బాధితుల(Flood victims)కు ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరి వరదలను అంచనా వేయడంలో ప్రస్తుత అధికారులు, ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. గ్రామాల్లో మంచినీరు, వైద్యం అందించాలని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, విత్తనాలను ఉచితంగా అందించాలని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-25T16:03:37+05:30 IST