Marchలో పాంబన్‌లో తొలి లిఫ్ట్‌ వంతెన ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-06T15:40:50+05:30 IST

ఆసియాలోనే తొలిసారిగా నిర్మితమైన అత్యాధునిక లిఫ్ట్‌ వంతెన 2023 మార్చిలో ప్రారంభం కానుంది. రామనాథపురం జిల్లా రామేశ్వరం పాంబన్‌ సమీపంలో

Marchలో పాంబన్‌లో తొలి లిఫ్ట్‌ వంతెన ప్రారంభం

ఐసిఎఫ్‌(చెన్నై), జూలై 5: ఆసియాలోనే తొలిసారిగా నిర్మితమైన అత్యాధునిక లిఫ్ట్‌ వంతెన 2023 మార్చిలో ప్రారంభం కానుంది. రామనాథపురం జిల్లా రామేశ్వరం పాంబన్‌ సమీపంలో 1914లో ఏర్పాటుచేసిన రైల్వే వంతెన, మధ్య ఉన్న లిఫ్ట్‌ వంతెన శిధిలావస్థకు చేరుకోవడంతో రూ.250 కోట్ల వ్యయంతో కొత వంతెన నిర్మాణాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. 2019 నవంబరు 8న భూమిపూజతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కరోనా లాక్‌డౌన్‌తో మందకొడిగా జరిగిన పనులు, ప్రస్తుతం సముద్రంలో 20 మీటర్ల దూరంలో 101 స్తంభాల నిర్మాణం ఇటీవల ముగిసింది. పాంబన్‌ సమీపంలో 2.075 కి.మీటర్ల మేరకు ఏర్పాటైన కొత్త రైలు వంతెన ఇదేనని, ఈ వంతెన మధ్యన స్పెయిన్‌ దేశ సంస్థ రూపొందించిన లిఫ్ట్‌ వంతెన ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి వంతెన అమెరికా, ఫ్రాన్స్‌ తర్వాత పాంబన్‌లో మాత్రమే ఏర్పాటవుతోందని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-07-06T15:40:50+05:30 IST