మార్చి నుంచి సేలం-చెన్నై విమానసేవలు
ABN , First Publish Date - 2022-02-10T16:27:41+05:30 IST
సేలం నుంచి చెన్నైకు మార్చిలో విమానసేవలు ప్రారంభించనున్నట్లు విమాన రవాణా శాఖ సహాయ మంత్రి విజయకుమార్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ఆయన పంపిన లేఖలో, కేంద్ర ప్రభుత్వ ‘ఉడాన్’ పథకంలో
ఐసిఎఫ్(చెన్నై): సేలం నుంచి చెన్నైకు మార్చిలో విమానసేవలు ప్రారంభించనున్నట్లు విమాన రవాణా శాఖ సహాయ మంత్రి విజయకుమార్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ఆయన పంపిన లేఖలో, కేంద్ర ప్రభుత్వ ‘ఉడాన్’ పథకంలో రూ.1,450 ఛార్జీతో 2018 మార్చి 25 నుంచి ట్రూజెట్ ద్వారా చెన్నై-సేలం, సేలం-చెన్నై మధ్య విమానసేవలు ప్రారంభించామని తెలిపారు. ఆ సంస్థకు అందజేసిన అనుమతులు 2021 మార్చి 24వ తేదీతో ముగియగా, ఆ సంస్థ రెన్యువల్ చేసుకోలేదని తెలిపారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు వచ్చే మార్చి నుండి ‘టర్బో మెగా ఎయిర్వేస్’ సంస్థ సేలం-చెన్నై విమానసేవలు ప్రారంభించనుందని ఆయన తెలిపారు.