2న మారెమ్మ జాతర
ABN , First Publish Date - 2021-04-22T04:55:47+05:30 IST
నగర 49వ డివిజన్ పరిధిలోని ఆలంఖాన్పల్లెలో వెలసిన మారెమ్మతల్లి జాతర మే 2న ఆదివారం జరగ నున్నట్లు ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు.
కడప(మారుతీనగర్), ఏప్రిల్ 21: నగర 49వ డివిజన్ పరిధిలోని ఆలంఖాన్పల్లెలో వెలసిన మారెమ్మతల్లి జాతర మే 2న ఆదివారం జరగ నున్నట్లు ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. కాగా 1వ తేదీ శనివారం ఉదయం అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక అభిషేకం, సాయంత్రం పురవీధుల గుండా అమ్మవారి ఊరేగింపు ఉంటుందని, 2వ తేది ఆదివారం ఉదయం 6 గంటల నుంచే అమ్మవారికి నిండుకుండ బోనాలు, అనంతరం 9 నుంచి వృషభరాజములచే బండలాగుడు పోటీలుంటాయన్నారు. అదేరోజు రాత్రి ఆలయ సమీపంలో చెక్కభజన కార్యక్రమం ఉంటుందని, గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు. కాగా ఈ జాతర పూర్తిగా కొవిడ్ నిబంధనల మేరకు జరుగుతుందని, ఆలయానికి వచ్చే ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి రావాలని ఆలయ కమిటీ పెద్దలు సూచించారు.