గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2022-02-11T02:39:59+05:30 IST
అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం
భద్రాద్రి: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన విశ్వసనీయమైన సమాచారంతో పట్టణంలోని పలు ప్రాంతాలలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో 25 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 3లక్షల 75వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని రవాణా చేస్తున్న ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గరి నుంచి గంజాయితో పాటు ఓ బైక్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.