కన్నుల పండువగా మార్కండేయుని శోభాయాత్ర
ABN , First Publish Date - 2022-08-13T06:20:02+05:30 IST
నూలు పౌర్ణమి, రక్షాబంధన్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన శివభక్త మార్కండేయ స్వామి శోభాయత్ర కన్నుల పండువగా సాగింది.
- వేలాదిగా తరలి వచ్చిన పద్మశాలీలు
సిరిసిల్ల ఆగస్టు 12( ఆంధ్రజ్యోతి): నూలు పౌర్ణమి, రక్షాబంధన్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన శివభక్త మార్కండేయ స్వామి శోభాయత్ర కన్నుల పండువగా సాగింది. సిరిసిల్ల మార్కండేయ దేవస్థానం నుంచి సిరిసిల్ల పద్మశాలి సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణతో మార్కండేయస్వామి రథం ముందుకు కదిలింది. వేలాది మంది పద్మశాలీలు తరలి రావడంతో రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. శోభాయాత్రలో మగ్గంపై కార్మికుడు కండువా నేస్తూ ప్రదర్శన నిర్వహించాడు. బాలికలు కోలాటం, పద్మశాలీ పుర ప్రముఖులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. చేనేత చౌక్కు వద్ద నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. ఉదయంు మార్కండేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. యజ్ఞోపవీత ధారణతోపాటు గణపతిపూజ, నవగ్రహ ఆరాధన, గాయత్రీ హోమం, నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, అర్బన్బ్యాంక్ చైర్మన్ గాజుల నారాయణ, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య, సిరిసిల్ల అధ్యక్షుడు గోలి వెంకటరమణ, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లగిశెట్టి శ్రీనివాస్, సెస్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, సిరిసిల్ల పద్మశాలి ప్రధాన కార్యదర్శి మండల సత్యం, పద్మశాలి సంఘం ప్రతినిధులు బొల్లి రామ్మోహన్, మోర రవి, డాక్టర్ గాజుల బాలయ్య, గుండ్లపెల్లి శ్రీనివాస్, దూడం శంకర్, గోవిందు రవి, గుండ్లపెల్లి పూర్ణచందర్, గెంట్యాల శ్రీనివాస్, మహిళా సంఘం అధ్యక్షురాలు కాముని వనిత, బూట్ల లత, మ్యాన పల్లవి, గుజ్జెతార, పత్తిపాక పద్మ, దార్నం అరుణ, రాపెల్లి లక్ష్మీనారాయణ, బీజేపీ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ దార్నం లక్ష్మీనారాయణ, తాటిపాముల దామోదర్, కట్టెకోల లక్ష్మీనారాయణ, శ్రీహరి, కౌన్సిలర్లు, పద్మశాలి అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తంగళ్లపల్లిలో..
తంగళ్లపల్లి: తంగళ్లపల్లి మండలం పద్మనగర్లో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నూలు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు మోర శ్రీకాంత్, ఉపాఽధ్యక్షుడు సామల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కుమ్మరికుంట శ్రీహరి, కోశాధికారి అన్నల్దాస్ చంద్రశేఖర్, సహాయ కార్యదర్శి గూడూరి దేవదాస్, సాంస్కృతిక కార్యదర్శి ఆడెపు అమర్, నాయకులు పాల్గొన్నారు.