ఈ-ఫార్మ్‌ మార్కెటింగ్‌ ద్వారా లావాదేవీలు పెంచాలి

ABN , First Publish Date - 2022-07-05T06:08:38+05:30 IST

ఈ-ఫార్మ్‌ మార్కెటింగ్‌ విధానంలో ప్రతీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో లావాదేవీల సంఖ్య పెంచాలని ఆ శాఖ రాష్ట్ర కమిషనర్‌ ప్రద్యుమ్న ఆదేశించారు.

ఈ-ఫార్మ్‌ మార్కెటింగ్‌ ద్వారా లావాదేవీలు పెంచాలి
మిర్చియార్డు పరిపాలన భవనంలో జరిగిన సమావేశానికి హాజరైన మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న

మార్కెటింగ్‌ శాఖ రాష్ట్ర కమిషనర్‌ ప్రద్యుమ్న

గుంటూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఈ-ఫార్మ్‌ మార్కెటింగ్‌ విధానంలో ప్రతీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో లావాదేవీల సంఖ్య పెంచాలని ఆ శాఖ రాష్ట్ర కమిషనర్‌ ప్రద్యుమ్న ఆదేశించారు. సోమవారం మిర్చియార్డు పరిపాలన భవనంలో విజయవాడ, వైజాగ్‌ రీజియన్‌ మార్కెట్‌ కమిటీల సెక్రటరీలు, అసిస్టెంట్‌ డైరెక్టర్లతో ఆయన వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఒక్కో మార్కెట్‌ కమిటీ పరిధిలో నెలకు కనీసం రూ. 10 లక్షల విలువ చేసే లావాదేవీలు జరగాలన్నారు. ఇందుకోసం సెక్రటరీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కొంతమంది కార్యదర్శులు విధి నిర్వహణల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారని, వారిపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈ-ఫార్మ్‌ మార్కెటింగ్‌ విధానం వలన రైతులకు బహుళ ప్రయోజనాలున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో సీఈవో బీ శ్రీనివాసరావు, జేడీలు కాకుమాను శ్రీనివాసరావు, సుధాకర్‌, మిర్చియార్డు సెక్రెటరీ ఐ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-07-05T06:08:38+05:30 IST