వివాహిత అదృశ్యం

ABN , First Publish Date - 2021-04-24T04:56:38+05:30 IST

వివాహిత అదృశ్యం

వివాహిత అదృశ్యం

బంట్వారం: ఓ వివాహిత అదృశ్యమైన సంఘటన బంట్వారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ధారూరు మండల కేంద్రానికి చెందిన పావని(35) తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మ స్వగ్రామమైన బంట్వారం మండలం బొపునారం గ్రామంలో పెరిగింది. అదే క్రమంలో హైదరాబాద్‌లోని మణికొండకి చెందిన హనుమంతు అనే వ్యక్తితో వివాహం చేశారు. వారం రోజుల క్రితం అమ్మమ్మ వాళ్లను చూసి వద్దాం అని బొపునారం వచ్చిన ఆమె ఈనెల 21వ తేదీన తిరిగి హైదరాబాద్‌ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వికారాబాద్‌ బస్సుఎక్కి వెళ్లింది. కాగా రెండు రోజులు గడిచినా మణికొండలో ఉన్న తనఇంటికి చేరుకోలేదు. అమ్మమ్మ లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.    

Updated Date - 2021-04-24T04:56:38+05:30 IST