ప్రేయసి ఫ్లాట్‌కు వెళ్లిన ప్రియుడు.. సడన్‌గా భర్త ఎంట్రీ.. దొరికిపోకుండా ఉండేందుకు ప్రియుడితో రిస్కీ ఫీట్లు.. చివరకు షాకింగ్ సీన్..

ABN , First Publish Date - 2021-12-16T18:19:50+05:30 IST

ఆమె వివాహిత.. వివాహానికి ముందే ఆమె వేరొక వ్యక్తితో ప్రేమాయణం సాగించింది.. వివాహం తర్వాత కూడా అతడిని కలుస్తూ ఉండేది.

ప్రేయసి ఫ్లాట్‌కు వెళ్లిన ప్రియుడు.. సడన్‌గా భర్త ఎంట్రీ.. దొరికిపోకుండా ఉండేందుకు ప్రియుడితో రిస్కీ ఫీట్లు.. చివరకు షాకింగ్ సీన్..

ఆమె వివాహిత.. వివాహానికి ముందే ఆమె వేరొక వ్యక్తితో ప్రేమాయణం సాగించింది.. వివాహం తర్వాత కూడా అతడిని కలుస్తూ ఉండేది.. ఇటీవల నేరుగా ఇంటికే పిలిపించుకుంది.. అయితే ప్రియుడు ఉండగానే భర్త ఇంటికి వచ్చేశాడు.. దీంతో కంగారు పడిన ఆమె ప్రియుడిని బాల్కనీ గోడకు వేలాడదీసింది.. చాలా సేపు అలాగే ఉండాల్సి రావడంతో అతను పట్టు తప్పి ఐదో అంతస్థు నుంచి జారి పడిపోయాడు.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ప్రాణాలు విడిచాడు.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


జైపూర్ నగరంలో రాహుల్ అనే వ్యక్తి తన భార్య అయేషా, కూతురుతో ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. అయేషా వివాహానికి ముందు నుంచి మొహ్సిన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. రాహుల్‌తో పెళ్లి తర్వాత కూడా మొహ్సిన్‌తో సంబంధం కొనసాగించింది. భర్త లేనపుడు అతడిని ఇంటికి పిలిచేది. సోమవారం మధ్యాహ్నం అయేషా, మొహ్సిన్ ఇంట్లో ఉండగా రాహుల్ వచ్చేశాడు. దీంతో భర్తకు దొరకకూడదనే ఉద్దేశంతో మొహ్సిన్‌ను బాల్కనీ రెయిలింగ్‌కు వేలాడమని చెప్పి అయేషా లోపలికి వెళ్లిపోయింది. 


అలా చాలా సేపు ఉండాల్సి రావడంతో మొహ్సిన్ పట్టుతప్పి ఐదో అంతస్థు నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అయేషా వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించింది. చికిత్స తీసుకుంటూ బుధవారం మొహ్సిన్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అయేషా అక్కడి నుంచి పరారైంది. ఇంటి దగ్గర కూడా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులు ఆమె గురించి వెతుకుతున్నారు. 

Updated Date - 2021-12-16T18:19:50+05:30 IST