ప్రియుడిని హతమార్చిన ప్రియురాలు.. ఎందుకో తెలిస్తే షాక్!
ABN , First Publish Date - 2022-03-11T17:54:19+05:30 IST
ఆమె వివాహిత.. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా.. రెండేళ్ల కిందట ఆమె తన పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఆమె వివాహిత.. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా.. రెండేళ్ల కిందట ఆమె తన పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఇద్దరూ తరచుగా కలుస్తూ ఉండేవారు.. ఆ విషయం భర్తకు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది.. దాంతో ప్రియుడిని ఆమె కలవడం తగ్గించింది.. దీంతో అతను ఆమెను బెదిరించడం ప్రారంభించాడు.. తన దగ్గరకు రాకపోతే ప్రైవేట్ వీడియో బయటపెడతానని బెదిరించాడు.. దీంతో ఆమె అతడిని హత్య చేసింది.
రాజస్థాన్లోని జైపూర్కు సమీపంలోని కర్దానీ ప్రాంతానికి చెందిన వినోదా దేవి అనే వివాహిత తన పక్కింట్లో ఉండే సుభాష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత రెండేళ్లుగా భర్తకు తెలియకుండా అతడిని కలిసేది. అయితే ఇటీవల ఆమె అఫైర్ గురించి భర్తకు తెలిసిపోయింది. దాంతో ఆమెను పుట్టింటికి పంపేశాడు. పెద్దలు రాజీ కుదిర్చి వినోదా దేవిని తిరిగి భర్త దగ్గరకు పంపారు. తిరిగి భర్త దగ్గరకు వెళ్లాక సుభాష్ను ఆమె కలవలేదు. అయితే సుభాష్ మాత్రం ఆమెను వదల్లేదు.
తన దగ్గరకు రమ్మని ఆమెను బలవంతపెట్టాడు. ఆమె మాట వినకపోవడంతో తమ ప్రైవేట్ వీడియోను బయటపెడతానని బెదిరించాడు. దీంతో వినోదా భయపడింది. సుభాష్ గదిలోకి వెళ్లి అతడు నిద్రపోతుండగా గొంతు కోసి చంపేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సుభాష్కు వినోదా దేవితో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుసుకుని ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆమె అసలు విషయం అంగీకరించింది. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.