రంగారెడ్డి జిల్లాలో వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-09T02:05:13+05:30 IST

జిల్లాలోని రాజేంద్రనగర్ పీఎస్ పరిధి ఉప్పర్‌పల్లిలో వివాహిత

రంగారెడ్డి జిల్లాలో వివాహిత ఆత్మహత్య

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పీఎస్ పరిధి ఉప్పర్‌పల్లిలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని హ్యాపీ హోమ్స్‌కు చెందిన ఫాతిమా సుల్తానాగా గుర్తించారు. ఫాతిమకు ఎనమిది ఏళ్ల క్రితం వివాహం అయింది. అనంతరం భర్తతో విడాకులు తీసుకుంది. తల్లితో ఫాతిమా కలిసి ఉంటూ ప్రయివేటుగా ఉద్యోగం చేస్తోంది. స్నేహితురాలి వివాహానికి వెళ్తానని తల్లితో ఫాతిమా చెప్పింది. అయితే వివాహానికి వద్దని ఫాతిమాను తల్లి వారించింది. దీంతో మనస్తాపం చెంది బెడ్రూంలో ఫ్యానుకు ఉరేసుకొని ఫాతిమా ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-11-09T02:05:13+05:30 IST