వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-27T06:46:39+05:30 IST
తిరుపతిలో మంగళవారం రాత్రి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈస్ట్ ఎస్ఐ ప్రకా్షకుమార్ తెలిపిన ప్రకారం..
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 26: తిరుపతిలో మంగళవారం రాత్రి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈస్ట్ ఎస్ఐ ప్రకా్షకుమార్ తెలిపిన ప్రకారం.. తిరుమలలో బొమ్మల వ్యాపారం చేస్తున్న వెంకటసుబ్బయ్య స్థానిక తుడా కార్యాలయం సమీపంలో భార్య పద్మావతి(35), ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. వ్యాపార విషయమై మంగళవారం ఉదయం ఆయన చెన్నైకి, పిల్లలు పాఠశాలకు వెళ్లారు. ఏమైందో ఏమోగాని వీరి కుమార్తె సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చేసరికి పద్మావతి ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి పద్మావతిని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.