మీ చెల్లిని అత్తారింట్లో దారుణంగా కొడుతున్నారంటూ ఓ వ్యక్తి ఫోన్.. బావకు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్.. కంగారుగా ఇంటికి వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-06-22T22:10:53+05:30 IST

`మీ చెల్లిని అత్తారింట్లో దారుణంగా కొడుతున్నారు.. త్వరగా రా` అంటూ అతనికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు..

మీ చెల్లిని అత్తారింట్లో దారుణంగా కొడుతున్నారంటూ ఓ వ్యక్తి ఫోన్.. బావకు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్.. కంగారుగా ఇంటికి వెళ్లి చూస్తే..

`మీ చెల్లిని అత్తారింట్లో దారుణంగా కొడుతున్నారు.. త్వరగా రా` అంటూ అతనికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు.. వెంటనే అతను తన చెల్లి భర్తకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు.. దీంతో ఏమైందో ఏమో అని కంగారుగా అతను చెల్లెలి ఇంటికి వెళ్లాడు.. అప్పటికే అక్కడ చెల్లి విగత జీవిగా పడి ఉంది.. ఏమైందని అడిగితే ఉరేసుకుందని అత్తింటి వారు చెప్పారు.. అదంతా అబద్ధమని, కట్నం కోసం భర్త, అత్తమామాలే తన చెల్లిని చంపేశారని ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


ఇది కూడా చదవండి..

పొలంలో కనిపించిన ప్రేమ జంట.. పట్టుకుని కొట్టి పెళ్లి చేసిన గ్రామస్తులు.. ఆమె తన కంటే రెండేళ్లు పెద్దయినా..


రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో కరిసాత్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ సింగ్‌ను ప్రియా దేవి (24) నాలుగేళ్ల కిందట పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే పెళ్లైన నాటి నుంచి ప్రియను రాజ్‌కుమార్ అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. డబ్బు, కారు, మామగారి ఇంటిలో వాటా కావాలని డిమాండ్ చేసేవాడు. 8 నెలల క్రితం నుంచి ఇద్దరి మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. ఎంత నచ్చ చెప్పినా రాజ్‌కుమార్ వినేవాడు కాదు. 


ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ప్రియా దేవి అన్నయ్య రాహుల్‌కు కరిసాత్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. `మీ చెల్లిని అత్తారింట్లో దారుణంగా కొడుతున్నారు.. త్వరగా రా` అని చెప్పాడు. వెంటనే  బావకు రాహుల్ ఫోన్ చేసినా అతను స్పందించలేదు. దీంతో రాహుల్ తన తండ్రితో కలిసి ప్రియ అత్తమామల ఇంటికి వెళ్లేటప్పటికీ ఆమె విగతజీవిగా పడి ఉంది. ప్రియ ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త, అత్తమామలు చెబుతున్నారు. అయితే రాహుల్ మాత్రం తన సోదరిని అదనపు కట్నం కోసం భర్త, అత్తమామాలే చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2022-06-22T22:10:53+05:30 IST