పెళ్లైన ఏడాదిన్నరకే భర్త నుంచి విడిపోయిన మహిళ.. పుట్టింట్లోనే ఉంటూ షాకింగ్ నిర్ణయం.. రాత్రి అందరూ పడుకున్న తర్వాత..

ABN , First Publish Date - 2021-11-22T21:26:33+05:30 IST

పెళ్లి వయసు రాగానే ఆమెకు తన కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. ఏడాదిన్నరగా భర్తతో కాపురం చేసిన ఆమె.. ఆ తర్వాత అతడి నుంచి దూరమైంది. అనంతరం కొంతకాలం నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా

పెళ్లైన ఏడాదిన్నరకే భర్త నుంచి విడిపోయిన మహిళ.. పుట్టింట్లోనే ఉంటూ షాకింగ్ నిర్ణయం.. రాత్రి అందరూ పడుకున్న తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి వయసు రాగానే ఆమెకు తన కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. ఏడాదిన్నరగా భర్తతో కాపురం చేసిన ఆమె.. ఆ తర్వాత అతడి నుంచి దూరమైంది. అనంతరం కొంతకాలం నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. భోజనం చేసి అందరూ పడుకున్న తర్వాత.. ఆమె చేసిన పనికి కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందిన 21ఏళ్ల సీతాబాయ్‌కి రెండున్నరేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఏడాదిపాటు ఆమె తన భర్తతో కాపురం చేసింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ.. భర్త నుంచి దూరమై తిరిగి పుట్టింటికి చేరింది. ఏడాదిగా కుటుంబ సభ్యలతో కలిసి కూలి పనులకు వెళ్తూ.. జీవిస్తోంది. ఎప్పటిలాగే ఆదివారం రోజు కూడా కూలి పనులకు వెళ్లొచ్చిన ఆమె కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేసింది. ఆ తర్వాత తన గదికి వెళ్లి పడుకుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు అందరూ నిద్రపోయిన తర్వాత సీతాబాయ్.. షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా.. ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచిన కుటుంబ సభ్యులు.. సీతాబాయ్ పరిస్థితిని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ తర్వాత ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు.. సీతాబాయ్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.



Updated Date - 2021-11-22T21:26:33+05:30 IST