నా భార్యను నాకు కాకుండా చేశారంటూ పగ.. ముగ్గురిని కిడ్నాప్ చేసిన భర్త.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-01-26T21:38:57+05:30 IST

అతడికి కొద్ది రోజుల క్రితమే వివాహమైంది. భార్యతో కలిసి సంతోషంగా ఉంటున్నాడు. కానీ ఓ రోజు సడన్‌గా భార్య ఇంట్లోంచి అద‌ృశ్యమైంది. దీంతో అతడు తీవ్రంగా కలత చెందాడు. తర్వాత తన

నా భార్యను నాకు కాకుండా చేశారంటూ పగ.. ముగ్గురిని కిడ్నాప్ చేసిన భర్త.. అసలేం జరిగిందంటే..

రాజస్థాన్: అతడికి కొద్ది రోజుల క్రితమే వివాహమైంది. భార్యతో కలిసి సంతోషంగా ఉంటున్నాడు. కానీ ఓ రోజు సడన్‌గా భార్య ఇంట్లోంచి అద‌ృశ్యమైంది. దీంతో అతడు తీవ్రంగా కలత చెందాడు. తర్వాత తన భార్యకు సంబంధించిన ఓ సంచలన విషయం అతడికి తెలిసింది. దీంతో తన భార్యను తనకు కాకుండా చేశారంటూ.. ముగ్గురు వ్యక్తులపై పగ పెంచుకున్నాడు. అంతేకాకకుండా వారిని కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకెళ్తే..


రాజస్థాన్‌లోని మారోత్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కొద్ది రోజుల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత ఆ దంపతులు సంతోషంగానే ఉన్నారు. అయితే ఈ నెల 21న అతడి భార్య అకస్మాత్తుగా కనిపించకుండాపోయింది. దీంతో భార్య కోసం అతడు గాలించాడు. బంధువులకు ఫోన్ చేసి ఆమె జాడ కన్నుక్కోవడానకి ప్రయత్నించాడు. అయినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే జనవరి 25న ప్రియుడితో పోలీస్ స్టేషన్‌లో ఆమె ప్రత్యక్షమైంది. భర్తతో కలిసి ఉండనని అధికారుల ముందు తెగేసి చెప్పేసింది. 


ఇంతలోనే ఈ విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. దీంతో కోపంతో ఊగిపోయాడు. తన భార్య ఆమె ప్రియుడితో కలిసి వెళ్లిపోవడానికి కారణమైన వారిపై పగ పెంచుకున్నాడు.  ఈ నేపథ్యంలోనే సాంభార్ ఇంటర్‌సెక్షన్‌ ప్రాంతంలో ఉన్న ఆమె ప్రియుడి ముగ్గురు స్నేహితుల్ని కిడ్నాప్ చేశాడు. ఈ విషయంకాస్తా పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు బాధితులను కాపాడారు. అంతేకాకుండా ముగ్గుర్ని కిడ్నాప్ చేసినందుకుగాను చట్టప్రకారం వివాహిత భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Updated Date - 2022-01-26T21:38:57+05:30 IST