తెల్లవారుజామున అలికిడి.. నిద్రలేచి చూసిన 10 ఏళ్ల కూతురికి కనిపించిన దృశ్యం చూసి మైండ్‌బ్లాక్.. అరిస్తే చంపేస్తానంటూ..

ABN , First Publish Date - 2022-08-23T20:21:31+05:30 IST

ఆ మహిళ వివాహిత.. పదేళ్ల కూతురికి తల్లి.. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది..

తెల్లవారుజామున అలికిడి.. నిద్రలేచి చూసిన 10 ఏళ్ల కూతురికి కనిపించిన దృశ్యం చూసి మైండ్‌బ్లాక్.. అరిస్తే చంపేస్తానంటూ..

ఆ మహిళ వివాహిత.. పదేళ్ల కూతురికి తల్లి.. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అతడితోనే కలిసి జీవించాలనుకుంది.. ఆదివారం తెల్లవారు ఝామున ప్రియుడు కొంత మందితో కలిసి ఆమె ఇంటికి వెళ్లాడు.. ఆమె ఇంట్లో ఉన్న నగదు, బంగారం తీసుకుని ప్రియుడితో వెళ్లేందుకు సిద్ధమవుతోంది.. అదే సమయంలో ఆమె పదేళ్ల కూతురు నిద్ర లేచింది.. ప్రియుడు ఆమెకు పిస్టల్ గురి పెట్టి అరిస్తే చంపేస్తానని బెదిరించాడు.. కూతురి ఎదురుగానే ఆ మహిళ తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.. సోమవారం ఉదయం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


ఇది కూడా చదవండి..

Crime: దారుణం.. కేవలం రూ.300 కోసం స్నేహితుడితో గొడవ.. చివరకు ఏం జరిగిందంటే..


హర్యానా (Haryana)లోని పానిపట్ నగరంలోని మోడల్ టౌన్‌కు చెందిన ఓ వ్యక్తి స్థానిక కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని భార్య సిద్ధార్థ్ నగర్‌లోని ఓ బ్యూటీపార్లర్‌లో బ్యుటీషియన్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్లేది. అక్కడ ఆమెకు మన్‌దీప్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచుగా కలిసి తిరిగేవారు. భర్తను, పిల్లలను వదిలేసి మన్‌దీప్‌తో వెళ్లిపోవడానికి ఆ మహిళ సిద్ధపడింది. 


ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మన్‌దీప్‌ తన నలుగురు సహచరులతో కలిసి ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. మన్‌దీప్‌తో పాటు వెళ్లేందుకు ఆ మహిళ సిద్ధమైంది. బంగారం, నగలు సర్దుకుంటోంది. ఆ అలికిడికి ఆమె 10 ఏళ్ల కుమార్తె నిద్రలేచింది. వెంటనే మన్‌దీప్ ఆమెకు పిస్టల్‌ చూపించి శబ్దం చేస్తే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం మన్‌దీప్‌ తన ప్రియురాలిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. తర్వాతి రోజు ఉదయం మహిళ భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-08-23T20:21:31+05:30 IST