కట్నం ఇవ్వలేదని వదిలేసిన భర్త.. పుట్టింట్లో ఉన్న ఆమెపై పక్కింటి వ్యక్తి కన్ను.. చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-03-11T05:42:40+05:30 IST

ఆమెకు ఏడాది కిందట వివాహమైంది. అయితే ఇస్తామన్న కట్నం ఇవ్వలేదని అలిగిన భర్త ఆమెను పుట్టింట్లోనే వదిలేశాడు. దాంతో ఆమె ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఆమెపై పక్కింటి వ్యక్తి కన్నేశాడు...

కట్నం ఇవ్వలేదని వదిలేసిన భర్త.. పుట్టింట్లో ఉన్న ఆమెపై పక్కింటి వ్యక్తి కన్ను.. చివరకు ఏమైందంటే..

ఆమెకు ఏడాది కిందట వివాహమైంది. అయితే ఇస్తామన్న కట్నం ఇవ్వలేదని అలిగిన భర్త ఆమెను పుట్టింట్లోనే వదిలేశాడు. దాంతో ఆమె ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఆమెపై పక్కింటి వ్యక్తి కన్నేశాడు.. శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేశాడు.. తీవ్ర వేదనకు గురైన ఆ మహిళ ఏం చేసిందంటే.. 


రాజస్థాన్‌లో మతిసర్‌కు చెందిన మంగారం అనే వ్యక్తితో జెతీదేవికి ఏడాది క్రితం వివాహమైంది. ఇస్తామన్న కట్నం ఇవ్వకపోవడంతో అత్తింట్లో జెతీదేవికి వేధింపులు ఎదురయ్యాయి. జెతీని భర్త ఇంటి నుంచి తరిమేశాడు. దీంతో జెతీ తన పుట్టింటికి వెళ్లిపోయి ఆరు నెలలుగా తన తల్లి, ఇద్దరు సోదరులతో కలిసి నివసిస్తోంది. ఆ సమయంలో జెతీకి ఓ యువకుడి రూపంలో మరో సమస్య ఎదురైంది. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని జెతీని పక్కింట్లో నివసించే జస్రామ్ అనే యువకుడు ఒత్తిడి చేశాడు. అతడు ప్రతిరోజూ జెతీదేవిని వేధించేవాడు. 


భర్తతో విభేదాలు, యువకుడి వేధింపులను జెతీదేవి తట్టుకోలేకపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం మధ్యాహ్నం ఉరేసుకుంది. బయటి నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు జెతీ ఉరికి వేలాడుతుండడాన్ని చూసి షాకయ్యారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడిని అరెస్ట్ చేశారు. మృతురాలి భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-03-11T05:42:40+05:30 IST