2న అమరవీరుల ఆశయసాధన ర్యాలీ
ABN , First Publish Date - 2022-05-29T03:55:24+05:30 IST
హైదరాబాద్లో జూన్ 2న నిర్వహించే తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన ర్యాలీకి అధిక సంఖ్యలో రావాలని తెలంగాణ యంగ్లీడర్స్ జిల్లా అధ్య క్షుడు దుర్గం రవీందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం తెలంగాణ అమరవీరుల సాధన ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించారు.
రెబ్బెన, మే 28: హైదరాబాద్లో జూన్ 2న నిర్వహించే తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన ర్యాలీకి అధిక సంఖ్యలో రావాలని తెలంగాణ యంగ్లీడర్స్ జిల్లా అధ్య క్షుడు దుర్గం రవీందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం తెలంగాణ అమరవీరుల సాధన ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణాలు ఇచ్చినట్టు తెలిపారు. తెలంగాణ యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో గన్పార్కు అమర వీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ మీదుగా అమర వీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ర్యాలీ విజయవంతానికి అంతా కృషి చేయాలన్నారు. పోస్టర్ల ఆవిష్కరణలో నాయకులు ఉపేందర్, దేవాజీ, రమేష్, రహీం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.