మారుతి ఎగుమతులు 20 లక్షలు

ABN , First Publish Date - 2021-02-28T09:12:30+05:30 IST

దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతి సుజుకీ ఇండియా మొత్తం ఎగుమతులు 20 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి.

మారుతి ఎగుమతులు 20 లక్షలు

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతి సుజుకీ ఇండియా మొత్తం ఎగుమతులు 20 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌ ద్వారా ఎస్‌-ప్రెస్సో, స్విఫ్ట్‌, విటారా బ్రెజ్జా మోడళ్లను దక్షిణాఫ్రికాకు ఎగమతి చేయడం ద్వారా ఈ మైలురాయికి చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. తమ కంపెనీ గత 34 ఏళ్లుగా వాహనాలను ఎగుమతి చేస్తోందని మారుతి సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయుకవా తెలిపారు. ప్రస్తుతం మారుతి 100కు పైగా దేశాలకు 14 మోడళ్లను ఎగుమతి చేస్తోంది. 

Updated Date - 2021-02-28T09:12:30+05:30 IST