కరోనాతో 16 వరకు మారుతి సుజుకి ప్లాంట్ మూసివేత
ABN , First Publish Date - 2021-05-09T23:38:27+05:30 IST
కరోనాతో 16 వరకు మారుతి సుజుకి ప్లాంట్ మూసివేత
కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో మారుతి సుజుకి ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మారుతి సుజుకి ఇండియా తన ప్లాంట్ల నిర్వహణ షట్ డౌన్ ను మే 16 వరకు పొడిగించినట్లు తెలిపింది. 2021 మే 9 వరకు ఉన్న మెయింటెనెన్స్ షట్ డౌన్ పొడిగించబడుతోందని, ప్రస్తుత మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్ వద్ద ఉన్న ప్లాంట్లలో కొన్ని కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపింది.