డోకిపర్రు జిల్లా పరిషత్ పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం

ABN , First Publish Date - 2022-05-02T17:56:14+05:30 IST

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం రేపుతోంది.

డోకిపర్రు జిల్లా పరిషత్ పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం

విజయవాడ: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం రేపుతోంది. పక్కనే ఉన్న పామర్రు మండలం పసమర్రు జిల్లా పరిషత్ పాఠశాలలను నుండి  ప్రశ్నా పత్రాలను, సమాధానాల స్లీప్‌లను పరీక్షా కేంద్రానికి పంపుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. సమాచారం అందిన వెంటనే విద్యాశాఖ, పోలీస్ అధికారులు పసుమర్రు జిల్లా పరిషత్ పాఠశాలకు చేరుకున్నారు. పలువురు ఉపాధ్యాయుల వద్ద నేడు జరుగుతున్న పరీక్షల ప్రశ్నలకు సెల్ ఫోన్‌లో సమాధానాలు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. డీఈఓ తాహిరా సుల్తానా పసుమర్రు చేరుకొని విచారణ చేపట్టారు. విచారణ జరుగుతున్న దృష్ట్యా మీడియాకు వివరాలు చెప్పేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. 

Updated Date - 2022-05-02T17:56:14+05:30 IST