సెంట్రల్ ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2022-05-20T23:27:54+05:30 IST
సెంట్రల్ ఢిల్లీలోని ఝాండేవాలన్ సైకిల్ మార్కెట్ గోదాములో శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటల ప్రాంతంలో ..
న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని ఝాండేవాలన్ సైకిల్ మార్కెట్ గోదాములో శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాములో మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో 27 అగ్నిమాపటక శకటాలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి. సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించినట్టు సమాచారం లేదని చెప్పారు. ప్రమాద కారణాలు కానీ, ఏమేరకు ఆస్తినష్టం జరిగిందనేది కానీ వెంటనే తెలియలేదు.
కాగా, దీనికి ముందు ఈశాన్య ఢిల్లీలోని ముస్తఫాబాద్ ఏరియాలో గురువారం ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ ఫ్యాక్టరీలోలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని 42 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఆరుగురు గాయపడ్డారు. ఈనెల 13న ఢిల్లీ ముండ్కా ఏరియాలోని కమర్షియల్ బిల్డింగ్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.