Gurugram డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-04-26T13:04:22+05:30 IST

గురుగ్రామ్‌లోని మనేసర్‌లోని చెత్త డంపింగ్ యార్డులో సోమవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది....

Gurugram డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం

గురుగ్రామ్: గురుగ్రామ్‌లోని మనేసర్‌లోని చెత్త డంపింగ్ యార్డులో సోమవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మనేసర్‌లోని సెక్టార్-6 సమీపంలో ఈ ఘటన జరిగింది. మంటలను ఆర్పేందుకు 35 అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి రప్పించారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. భారీగా మంటలు చెలరేగడంతో పొగలు కమ్ముకున్నట్లు కనిపించింది.సోమవారం తెల్లవారుజామున ఆగ్నేయ ఢిల్లీలోని జామియా నగర్‌లోని మురికివాడలో జరిగిన అగ్నిప్రమాదంలో 35 కి పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ మేరకు అగ్నిమాపకశాఖ అధికారులు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. 


ఈ ఘటనలో ఐదు పశువులు మృతి చెందినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు.మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో బాట్లా హౌస్ ప్రాంతంలోని మురికివాడలో అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖకు కాల్ వచ్చిందని, వెంటనే 11 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని గార్గ్ చెప్పారు.‘‘సుమారు 40 గుడిసెలకు మంటలు అంటుకున్నాయని, సాయంత్రం 4.40 గంటల సమయంలో మంటలు ఆర్పివేశాం’’ అని అతుల్ గార్గ్ చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

Updated Date - 2022-04-26T13:04:22+05:30 IST