Narasaraopet ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ABN , First Publish Date - 2022-06-04T14:17:56+05:30 IST

జిల్లాలోని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Narasaraopet ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

పల్నాడు: జిల్లాలోని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ నేత జల్లయ్య అంత్యక్రియలు నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు నరసరావుపేటలోకి రాకుండా పటిష్టంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే జల్లయ్య అంత్యక్రియలలో పాల్గొని తీరతామని టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబు స్పష్టం చేశారు. దీంతో నరసరావుపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది.


కాగా... టీడీపీ నేత జల్లయ్యపై వైసీపీ శ్రేణులు మారణాయుధాలతో  దాడిలో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన జల్లయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-06-04T14:17:56+05:30 IST