హైదరాబాద్లో భారీ చోరీ
ABN , First Publish Date - 2021-05-09T19:54:39+05:30 IST
చందానగర్లోని రెహన్ జ్యువెలరీలో భారీ చోరీ జరిగింది. 15 తులాల బంగారం, 15 కేజీల వెండి, రూ.4 లక్షలు అపహరణకు గురైనట్లు షాపు నిర్వాహకులు పోలీసులకు తెలిపారు.
హైదరాబాద్: నగరంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన చందానగర్లోని రెహన్ జ్యువెలరీలో చోటు చేసుకుంది. షాపులోని 15 తులాల బంగారం, 15 కేజీల వెండి, రూ.4 లక్షలు అపహరణకు గురైనట్లు షాపు నిర్వాహకులు తెలిపారు. అలాగే సీసీ ఫుటేజీకి సంబంధించిన డీవీఆర్ని కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి దుండగుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.