నేత్రపర్వంగా మాతమ్మ ఊరేగింపు

ABN , First Publish Date - 2022-08-16T16:57:31+05:30 IST

స్థానిక పాతచాకలిపేట పరశురాంవీధిలో కొలువైన మాతమ్మ ఆలయంలో 22వ వార్షిక ఆడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి వరకు అమ్మవా

నేత్రపర్వంగా మాతమ్మ ఊరేగింపు

ప్యారిస్‌(చెన్నై), ఆగస్టు 15: స్థానిక పాతచాకలిపేట పరశురాంవీధిలో కొలువైన మాతమ్మ ఆలయంలో 22వ వార్షిక ఆడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి వరకు అమ్మవారి ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, డప్పు వాయిద్యాల నడుమ పురవీధుల్లో అమ్మవారు విహరించారు. అడుగడుగునా భక్తులు అమ్మవారికి హారతులిచ్చి ఘనంగా స్వాగతించారు. కొరుక్కుపేట గ్రామ పంచాయతీ సంఘ అధ్యక్షుడు సీపీ ప్రేమ్‌కుమార్‌(CP Premkumar), కార్యదర్శి వైఎం.చలపతిరావ్‌, కోశాధికారి వీసీ వరదరాజులు, నిర్వాహకులు తిరుపతి నాగరాజ్‌(Tirupati Nagaraj), పి.శివప్రసాద్‌, కమిటీ, గ్రామ యువకులు సమష్టిగా మాతమ్మవారి ఊరేగింపును విజయవంతంగా చేశారు. రాయపురం ఎమ్మెల్యే ఐడ్రీమ్‌ మూర్తి అమ్మవారి సేవలో తరలించారు.


Updated Date - 2022-08-16T16:57:31+05:30 IST