india vs west indies t20 : ప్చ్.. మ్యాచ్ మరింత ఆలస్యం.. తాజా అప్‌డేట్ ఇదీ

ABN , First Publish Date - 2022-08-02T03:22:58+05:30 IST

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies) టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు సంబంధించి తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది.

india vs west indies t20 : ప్చ్.. మ్యాచ్ మరింత ఆలస్యం.. తాజా అప్‌డేట్ ఇదీ

సెయింట్ కిట్స్ : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies) టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌ మరో గంట ఆలస్యంగా మొదలవనుంది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవనుందని కామెంటేటర్ హర్ష భోగ్లే (Harsha Bhogle) వెల్లడించారు. ఇరు జట్లూ 20 ఓవర్ల చొప్పున  ఆడనున్నాయని ట్వీట్ చేశాడు. కాగా షెడ్యూల్ ప్రకారం... రాత్రి 8 గంటలకు ప్రారంభమవ్వాల్సిన మ్యాచ్ 2 గంటలు ఆలస్యంగా 10 గంటలకు ఆరంభమవనుందని వెస్టిండీస్ క్రికెట్(CWI) తొలుత ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ జరిగిన ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ నుంచి సెయింట్ కిట్స్‌కు చేరాల్సిన టీమ్ లగేజీ సమయానికి రాలేదు. రవాణా ఇబ్బందుల కారణంగా ఈ పరిస్థితి అనివార్యమైందని వివరణ ఇచ్చింది. అసౌకర్యానికి గురి చేస్తున్నందున విలువైన క్రికెట్ ఫ్యాన్స్, స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టింగ్ పార్టనర్స్, ఇతర భాగస్వాములకు పశ్చాత్తాపాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొంది.


అయితే.. అనివార్య పరిస్థితుల కారణంగా ఆలస్యంగా ప్రారంభమవ్వడం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌ని కాస్త నిరాశకు గురిచేస్తోంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలైతే 11 : 30 గంటల కల్లా పూర్తవుతుంది. అదే 11 గంటల మొదలైతే  అర్ధరాత్రి దాటాక 2:30 గంటల వరకు మ్యాచ్ కొనసాగనుంది. మ్యాచ్ చూడాలనుకునేవాళ్లు అంతసేపు నిద్రకోర్చుకోవడం తప్పదు మరీ. 


కాగా మొదటి మ్యాచ్ గెలిచిన రోహిత్ శర్మ సేన మంచి జోరు మీద కనిపిస్తోంది. నేడు (సోమవారం) రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో ఇంకో అడుగు ముందుకేయాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్టు 2 రోజులపాటు ప్రాక్టీస్ కూడా చేసింది.  ఇక శుక్రవారం ముగిసిన తొలి మ్యాచ్‌లో టీమిండియా సమష్టి ప్రదర్శనతో విజయం సాధించింది. 68 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి సిరీస్‌లో అదిరిపోయే బోణి చేసింది. కాగా రెండవ మ్యాచ్ జరగబోయే వేదిక సెయింట్ కిట్స్‌లోనే మూడవ మ్యాచ్ జరగనుంది. మంగళవారమే ఈ మ్యాచ్ జరగనుంది.



Updated Date - 2022-08-02T03:22:58+05:30 IST