డ్రాగా ముగిసిన మ్యాచ్‌లు

ABN , First Publish Date - 2021-10-17T05:16:19+05:30 IST

ఏసీఏ అండర్‌- 19 మల్టీడే సౌత్‌జోన్‌ అంతర్‌జిల్లాల క్రికెట్‌ మ్యాచ్‌లలో భాగంగా వైఎ్‌సఆర్‌ ఏసీఏ స్టేడియంలో అనంతపురం- కడప జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో పాటు కేఓఆర్‌ఎం మైదానంలో చిత్తూరు- కర్నూలు జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌ డ్రాగా ముగిశాయి.

డ్రాగా ముగిసిన మ్యాచ్‌లు

కడప (మారుతీనగర్‌)అక్టోబరు 16 : ఏసీఏ అండర్‌- 19 మల్టీడే సౌత్‌జోన్‌ అంతర్‌జిల్లాల క్రికెట్‌ మ్యాచ్‌లలో భాగంగా  వైఎ్‌సఆర్‌ ఏసీఏ స్టేడియంలో అనంతపురం- కడప జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో పాటు కేఓఆర్‌ఎం మైదానంలో చిత్తూరు- కర్నూలు జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌ డ్రాగా ముగిశాయి. ఇదిలావుండగా అనంతపురం జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి  132 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 436 పరుగులు చేసింది. తదుపరి బ్యాటింగ్‌ చేసి తన మొదటి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్‌ స్కోర్‌ 117 తో ఆట ప్రా రంభించిన కడప జట్టు  104.1 ఓవర్లలో 290 పరుగులకు ఆలౌట్‌ అయింది. చివరిరోజున అనంతపురం జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 1 వికెట్‌ కోల్పోయి 94 పరుగుల వద్ద డిక్లేడ్‌ చేసింది. కేఓఆర్‌ఎం మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో చిత్తూరు జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 112.3 ఓవర్లలో 441 పరుగులకు ఆలౌట్‌ అయింది. తదుపరి కర్నూలు జట్టు తన రెండవ ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో చిత్తూరు జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో లీడ్‌ సంపాధించిన దృష్ట్యా ఆ జట్టుకు 3 పాయింట్స్‌, కర్నూలు జట్టుకు 1 పాయింట్‌ లభించాయి. 


Updated Date - 2021-10-17T05:16:19+05:30 IST