సెంట్రల్ బ్యాంక్ సీఈఓగా మఠం వెంకటరావు
ABN , First Publish Date - 2021-03-02T06:34:29+05:30 IST
ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా మఠం వెంకటరావు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆయన కెనరాబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా మఠం వెంకటరావు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆయన కెనరాబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుం చి మూడేళ్లు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఏది ముందు ఏర్పడితే అంతవరకు ఆయన కొత్త పదవిలో ఉంటారని రెగ్యులేటరీ సంస్థలకు బ్యాంక్ తెలిపింది.
వెంకటరావు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ సర్టిఫైడ్ అసోసియేట్గా ఉన్నారు. 1988లో అలహాబాద్ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కెరీర్లో భాగంగా దేశంలోని పలు ప్రదేశాల్లో కీలక పదవులు నిర్వహించారు.