మహాశివరాత్రికి మత్స్యగుండం సిద్ధం: ఆర్డీవో

ABN , First Publish Date - 2021-03-09T06:55:43+05:30 IST

హుకుంపేట మండలం మఠం గ్రామంలోని మత్స్యగుండం మహాశివరాత్రి వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతి అన్నారు.

మహాశివరాత్రికి మత్స్యగుండం సిద్ధం: ఆర్డీవో
మత్స్యగుండంలో మహాశివరాత్రి ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి.


పాడేరు, మార్చి 8: హుకుంపేట మండలం మఠం గ్రామంలోని మత్స్యగుండం మహాశివరాత్రి వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతి అన్నారు. ఈనెల 11వ తేదీన జరిగే శివరాత్రి ఉత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఆలయం వద్ద భక్తుల రద్దీని నివారించేందుకు పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. మత్స్యగుండంలో నది స్నానాలకు వెళ్లే భక్తుల కోసం గజ ఈతగాళ్లను సిద్ధం చేశామన్నారు. భక్తులకు తాగునీటిని అందించే బాధ్యతను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు అప్పగించామన్నారు. పాడేరు పీటీడీ డిపో నుంచి 20 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వైబీ.కోటేశ్వరరావు, ఈవోపీఆర్డీ ఉమామహేశ్వరరావు, ఆర్‌ఐ బి.నల్లన్న పాల్గొన్నారు.


Updated Date - 2021-03-09T06:55:43+05:30 IST