అక్రమంగా చెరువు మట్టి తవ్వకాలు
ABN , First Publish Date - 2021-03-07T02:45:44+05:30 IST
మండలంలోని రావులపాడు చెరువు నుంచి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శనివారం
పెళ్లకూరు, మార్చి 6 : మండలంలోని రావులపాడు చెరువు నుంచి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శనివారం అక్రమంగా మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. శనివారం ఉదయం ఎక్స్కవేటర్ సహాయంతో తవ్వకాలు జరిపి మట్టిని తరలించాడు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న వ్యక్తి అదే చెరువులో సుమారు 2 ఎకరాల మేర ఆక్రమించి ఉన్నాడు. ఈ భూమిని చదునుచేయుటకుగాను ఈ మట్టిని అక్కడికి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దారు శ్రీనివాసులు వెంటనే ఆర్ఐ సాయితేజను సంఘటనాస్థలాని కి పంపారు. అయితే రెవెన్యూ సిబ్బంది వాహనాలను పట్టుకొని లోపయికారీ వ్యవహారంతో అక్రమార్కులతో చేతులు కలిపి వదిలిపెట్టినట్లు సమాచారం.