మండిన రాయలసీమ
ABN , First Publish Date - 2021-03-01T09:10:07+05:30 IST
రాయలసీమలో ఎండ ఠారెత్తించింది. కర్ణాటక, తమిళనాడులో ఎండతీవ్రత కారణంగా ఆ ప్రభావం రాయలసీమపై పడింది.
విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాయలసీమలో ఎండ ఠారెత్తించింది. కర్ణాటక, తమిళనాడులో ఎండతీవ్రత కారణంగా ఆ ప్రభావం రాయలసీమపై పడింది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలులో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా బంగాళాఖాతంలో నెలకొన్న అధికపీడన ప్రభావంతో కోస్తాపైకి తేమగాలులు వీశాయి. దీంతో కోస్తాలో అనేకచోట్ల మేఘాలు ఆవరించాయి.