మయాంక్కు పిలుపు
ABN , First Publish Date - 2022-06-28T09:31:58+05:30 IST
ఇంగ్లండ్తో జరిగే టెస్టు కోసం ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను ఎంపిక చేశారు. రోహిత్ కరోనా బారినపడడంతో అతడి బ్యాక్పగా మయాంక్కు పిలుపు అందింది.
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో జరిగే టెస్టు కోసం ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను ఎంపిక చేశారు. రోహిత్ కరోనా బారినపడడంతో అతడి బ్యాక్పగా మయాంక్కు పిలుపు అందింది. దీంతో అతను సోమవారం ఇంగ్లండ్కు పయనమయ్యాడు. ప్రస్తుత నిబంధనల ప్రకారం మయాంక్ క్వారంటైన్లో ఉండాల్సిన పని లేదు. అవసరమనుకుంటే వెంటనే జట్టులో చేరి బరిలోకీ దిగొచ్చు.
గత మార్చిలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీ్సలో చివరిసారిగా ఆడిన మయాంక్ రెండు మ్యాచ్ల్లో 59 పరుగులే చేశాడు. దీంతో ఇంగ్లండ్తో టెస్టుకు పక్కనబెట్టారు. అయితే రాహుల్ గాయం, రోహిత్కు కరోనా కారణంగా ముందు జాగ్రత్తగా ఈ 31 ఏళ్ల ఓపెనర్కు మరో అవకాశం దక్కింది. ఇదిలావుండగా.. ఇంగ్లండ్తో జరిగే ఐదో టెస్టు కోసం తమ సన్నాహకాలు బాగానే ఉన్నాయని కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. నాలుగు రోజుల వామప్ మ్యాచ్లో అన్ని విభాగాలను సరిచూసుకున్నామని, స్టోక్ సేనను ఎదుర్కొనేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని అతడు అన్నాడు.