హాస్టల్‌లో ఎంబీబీఎస్ యువతి ఆత్మహత్య.. గదిలో దొరికిన లేఖలో ఆమె రాసిన పదాలను చూసి నివ్వెరపోయిన పోలీసులు.. ఇంతకీ ఏముందంటే..

ABN , First Publish Date - 2021-10-23T00:09:06+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో ఉన్న తీర్థంకర్ మహవీర్ యూనివర్సిటీలో.. వైశాలి చౌదరి అనే యువతి ఎంబీబీఎస్ చదువుతోంది. హాస్టల్‌లో ఉంటూ రోజూ యూనివర్సిటీకి వెళ్తుండేది. ఈ క్రమంలో వైశాలి సీనియర్ అయిన ఆశిష్‌తో పరిచయం ఏర్పడింది.

హాస్టల్‌లో ఎంబీబీఎస్ యువతి ఆత్మహత్య.. గదిలో దొరికిన లేఖలో ఆమె రాసిన పదాలను చూసి నివ్వెరపోయిన పోలీసులు.. ఇంతకీ ఏముందంటే..

ఎంబీబీఎస్ చదువుతున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం.. సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసుల తనిఖీలో యువతి గదిలో ఓ లేఖ బయటపడింది. ఆమె అందులో ప్రసావించిన అంశాలే ఆత్మహత్యకు దారితీశాయా, లేక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..


పోలీసుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో ఉన్న తీర్థంకర్ మహవీర్ యూనివర్సిటీలో.. వైశాలి చౌదరి అనే యువతి ఎంబీబీఎస్ చదువుతోంది. హాస్టల్‌లో ఉంటూ రోజూ యూనివర్సిటీకి వెళ్తుండేది. ఈ క్రమంలో వైశాలి సీనియర్ అయిన ఆశిష్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఆశిష్ సీనియర్ కావడంతో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఢిల్లీ వెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయాయి. వైశాలి ఫోన్‌కు స్పందన లేకపోవడం, కలవాలన్నా పట్టించుకోకపోవడం చేస్తుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.


ఒక్కసారిగా ఆశిష్ తనను పట్టించుకోకపోవడంతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైంది. దీంతో యూనివర్సిటీకి కూడా సరిగా వెళ్లేది కాదు. ఓ రోజు హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అక్కడ దొరికిన ఓ లేఖలో మొత్తం ‘‘ఆశిష్ లవ్ వైశాలి’’ అని రాసి ఉంది. దీంతో ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తేల్చారు. అయితే తన కూతురి ఆత్మహత్యకు ఆశిష్, సమర్థ్ అనే వ్యక్తులే కారణమని.. వైశాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైశాలికి, ఆశిష్‌కు ఇతను కామన్ ఫ్రెండ్ అని తెలిసింది. దీంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-10-23T00:09:06+05:30 IST