టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
ABN , First Publish Date - 2022-10-02T05:53:36+05:30 IST
టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి
మహబూబాబాద్ టౌన్, అక్టోబరు 1: దేశంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విఽధానాలను ఎండగట్టాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కంకర అయ్యప్పరెడ్డి పిలుపునిచ్చారు. మహ బూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జిల్లాలోని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులను ప్రకటించి వారికి నియామక పత్రాలను అందించా రు. ఈ సందర్భంగా ఆయ్యప్పరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనరెడ్డి, జాతీయ కార్యదర్శి రాష్ట్ర ఇన్చార్జి రమేష్బాబు సూచన మేరకు మండల అధ్యక్షు లను నియమించామని తెలిపారు.
యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు వీరే...
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులను ప్రకటించి నియామక పత్రాలను అం దించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేముల నరేష్రెడ్డి, మహబూబాబాద్ అర్బన్ కు పుప్పాల కమలేందర్, మానుకోట మండల అధ్యక్షుడిగా గిద్దల సురేష్, గూడూ రుకు బొల్లికొండ మధు, నెల్లికుదురుకు గోగుల అశోక్, డోర్నకల్ అసెంబ్లీ నియోజ కవర్గ ఉపాధ్యక్షులుగా ఇస్లావత్ సుధాకర్, నరేష్గౌడ్, కురవి మండల అధ్యక్షుడిగా బాసబోయిన శ్రీను, డోర్నకల్కు గుగులోతు హుస్సెన్, చిన్నగూడూరుకు దుండి వెంకన్న, నర్సింహులపేటకు చిర్ర సతీష్, దంతాలపల్లికి బెల్లం సంపత్, మరిపెడకు అనిల్, మరిపెడ అర్బన్కు కుడితి నర్సింహారెడ్డి, డోర్నకల్ అర్బన్కు రాంకోటేష్ను నియమించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ భూక్య మురళీనాయక్, బండి శ్రీను, బానోత్ ప్రసాద్, రజినికాంత్, గంధసిరి శ్రావణ్, బీరయ్య, సాయితేజ, భాస్కర్, నీరుటి సురేష్ పాల్గొన్నారు.