దేశం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటోంది

ABN , First Publish Date - 2022-09-30T05:56:55+05:30 IST

దేశం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటోంది

దేశం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటోంది
వెంకటగిరిలో బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

 ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

కేసముద్రం, సెప్టెంబరు 29 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరి పాలనలో అన్ని విధాల విఫల మైనందున దేశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుం టోందని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ అన్నారు. మండలంలోని బేరువాడ, వెంకటగిరి, ఇంటికన్నె గ్రామాల్లో గురువారం బతుకమ్మ చీరెలు, ఆసరా పింఛన్లు, చేపపిల్ల లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల రైతులు తెలంగాణాలో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యం లో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా పథకాలు, 24 గంటల కరెంటులాంటి సౌక ర్యాలను కోరుకుంటు న్నారని తెలిపారు. ప్రతీ ఇంట్లో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారున్నారని, ఇలాంటి ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ వోలం చంద్రమోహన్‌, జడ్పీటీసీ రావుల శ్రీనాధ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ మర్రి రంగారావు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనా రాయణరావు, గణపారపు సరితరమేష్‌, వైస్‌ ఎంపీపీ రావుల నవీన్‌రెడ్డి, ఎంపీటీసీ చెలగోల రజిత, తహసీల్దార్‌ ఫరీదొద్దిన్‌, ఎంపీడీవో రోజారాణి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు నజీర్‌అహ్మద్‌, కముటం శ్రీనివాస్‌, పెదగాని వెంకన్న, టేకుల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-30T05:56:55+05:30 IST