వీరభద్ర స్వామి హుండీ ఆదాయం రూ.55.56 లక్షలు
ABN , First Publish Date - 2021-10-27T05:41:29+05:30 IST
వీరభద్ర స్వామి హుండీ ఆదాయం రూ.55.56 లక్షలు
కురవి, అక్టోబరు 26 : కురవి వీరభద్రస్వామి హుండీ ఆదాయం రూ.55,56,630 లభించినట్లు ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు. వీరభద్రస్వామి హుండీ ద్వారా రూ.42,68,680, భద్రకాళి అమ్మవారి హుండీ ద్వారా రూ.12,87,950 లభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ బాదావత్ రవినాయక్, సిబ్బంది పాల్గొన్నారు.