తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

ABN , First Publish Date - 2021-04-16T05:36:17+05:30 IST

వేసవి నేపథ్యంలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జడ్పీ సీఈవో టి.వెంకటే శ్వరరావు తెలిపారు.

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
అధికారులను వివరాలు అడుగుతున్న సీఈవో వెంకటేశ్వరరావు

రామభద్రపురం, ఏప్రిల్‌ 15: వేసవి నేపథ్యంలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జడ్పీ సీఈవో టి.వెంకటే శ్వరరావు తెలిపారు. మండల అభివృద్ధి కార్యాలయంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించామ ని, ఆయా గ్రామాల్లో క్రాస్‌ ప్రోగ్రాం అమలు చేస్తున్నామని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో తాగునీటి సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు.  ఇదిలా ఉండగా ఉద్యోగా లిప్పిస్తామని నిరుద్యోగులను ఫేక్‌ అపాయింట్‌మెంట్‌లు ఇచ్చిన ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌పై కోర్టులో కేసు ఉందని తెలిపారు. స్థానిక ఎంపీడీవోకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని, త్వరలోనే పూర్తిస్థాయి విచారణ జరుపుతామని  వెల్లడించా రు.  ఇక మండల కేంద్రంలో ఉన్న స్ర్టాంగ్‌ రూం భద్రతపై కూడా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీనియర్‌ అసిస్టెంట్‌ చొక్కాపు శ్రీరాములు నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-04-16T05:36:17+05:30 IST